Thursday, 23 June 2011

కీ.శే. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు

వేటూరి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే...
 ఆయన ఒక శక్తి...
 ఆయన ఒక యుక్తి...
 ఆయన ఒక స్పూర్తి...

ఇంటి పేరుని తన పేరుగా మార్చుకుని వంశ గౌరవం నిలబెట్టి తన గొప్పతనాన్ని చాటుకున్న దీక్షాదక్షుడు.
తెలుగుకి ప్రాచీన గౌరవం తేవాలని కాంక్షించి జాతీయ బహుమతి సైతం వద్దంటూ ప్రాచీన గౌరవం తెచ్చిన భగీరధుడు 
ఆయన ఒక్కో పదం ఒక్కో వేదం.. ఒక్కో పలుకు ఒక్కో నాదం... ఆయనే ముందు తరాలకి మార్గం 
ఆయన తన ముందు తరాలకి ఇచ్చిన ఆస్తి ఎంతకీ తరిగిపూని కవితా సంపుటి.

"ఆకాశాన్నాక్రమించిన ఆయన భావనాపాదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషాపాదానికి భక్తితో అంజలి ఘటిస్తూ "నా మూడో పాదాన్ని నీ నెత్తిన పెడతా" అంటున్న ఆయన తాండవ పాదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ" అని సిరివెన్నెల గారిచే అనిపించుకున్న గొప్ప మనీషి వేటూరి.



వివరాలు: 
అసలు పేరు: వేటూరి సుందరరామ మూర్తి 
పుట్టిన తేది: 29 జనవరి 1936
పుట్టిన  స్థలం: పెదకళ్ళేపల్లి , కృష్ణ జిల్లా 
భార్య పేరు: సీతామహాలక్ష్మి 
స్వర్గస్థులైన తేది: 22 మే 2010
  

No comments:

Post a Comment